UPI: మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలా చెల్లింపులు చేయడంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నేడు భారత్ లో ప్రతినెలా 1800కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది.
UPI: మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలా చెల్లింపులు చేయడంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నేడు భారత్ లో ప్రతినెలా 1800కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది.
అయితే యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం పూర్తి ఉచితం. ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గూగుల్ పే, ఫోన్ పే కలిసి గతేడాది రూ. 5,065కోట్లకు పైగా సంపాదించాయి. ఇదెలా సాధ్యం? పూర్తి వివరాలు తెలుసుకుందాం.నేటికాలంలో యూపీఐ అనేది కామన్ అయ్యింది. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఎవరైనా డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా చెల్లిస్తుంటారు. చాలా మంది యూపీఐ ద్వారానే చెల్లిస్తుంటారు. మనమే కాదు దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ప్రజలు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం అనేది పూర్తిగా ఉచితం. అయినప్పటికీ గూగుల్ పే, ఫోన్ పే కలిసి గతేడాది రూ. 5,065 కోట్లకుపైగా సంపాదించాయి. ఈ డిజిటల్ దిగ్గజాలు ఎలాంటి ప్రొడక్ట్ ను అమ్మకుండానే వేల కోట్లు ఎలా సంపాదించగలిగాయి. వీటిని బిజినెస్ స్ట్రాటజీ ఏంటి. ఈ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐస్ వీసీ వ్యవస్థాపక భాగస్వామి మృణాల్ లింక్డిన్ లో ఓ పోస్టును షేర్ చేశారు. అందులో గూగుల్ పే, ఫోన్ పే ఆదాయ నమూనాను వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ కంపెనీల ఆదాయంలో ఎక్కువ భాగం చిన్న కిరణా దుకాణాల నుంచి వచ్చింది. ఫోన్ పే వంటి యాక్స్ కిరాణా దుకాణాల్లో ఉపయోగించే వాయిస్ ఆపరేటెడ్ స్పీకర్ సర్వీసు నుంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రతి దుకాణంలో ఫోన్ పేలో రూ. 60 చెల్లించినప్పుడు..మీరు 60 రూపాయలు చెల్లించారు. అనే ఈ వాయిస్ ద్వారా నెలకు రూ. 100కి ఛార్జ్ తీసుకుంటారు. ఈ సౌకర్యం 30లక్షలకు పైగా దుకాణాల్లో అందుబాటులో ఉంది. వీటి ద్వారా నెలకు రూ. 30కోట్లు ఏడాదికి రూ. 360కోట్లు సంపాదిస్తుంది. ఈ పద్ధతి వినియోగదారులను ఆకర్షించడమే కాదు దుకాణాదారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సెకండ్ సీక్రెట్ ఏంటంటే..స్క్రాచ్ కార్డులు. ఇవి రూ. 12 క్యాష్ బ్యాక్ లేదా కూపన్ తో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. కానీ ఇది కేవలం కస్టమర్ ను ఆకట్టుకోవడమే కాదు..బ్రాండ్ కోసం యాడ్స్ చేయడానికి ఒక తెలివైన మార్గం. బ్రాండ్స్ ఈ కార్డుల కోసం డబ్బులు చెల్లిస్తాయి. గూగుల్ పే, ఫోన్ పేలకు రెట్టింపు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ మోడల్ ఇన్వెస్ట్ మెంట్ పై రాబడి యంత్రంలా పనిచేస్తుంది. ఈ కంపెనీలు UPI విశ్వసనీయతను సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ పొరగా మార్చాయి. GST సహాయం, ఇన్వాయిస్ మేకర్, మైక్రో-లోన్లు వంటి సౌకర్యాలు చిన్న వ్యాపారవేత్తలకు అందిస్తున్నాయి. UPI మౌలిక సదుపాయాలు కేవలం ఆకర్షణ మాత్రమే, కానీ నిజమైన వ్యాపారం సాఫ్ట్వేర్, ఆర్థిక సేవల నుండి వస్తోంది. ఈ నమూనాలో CAC సున్నా. ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఇదంతా స్కేల్, నమ్మకం,ఆవిష్కరణలపై మాత్రమే ఆధారపడి ఉందని మృణాల్ చెప్పారు. Google Pay, Phone Pay UPI ఉచిత ప్లాట్ఫారమ్ను ఉపయోగించి ఆర్థిక వ్యవస్థను సృష్టించాయి. ఇది ఉత్పత్తిని అమ్మకుండానే లాభానికి హామీ ఇస్తుంది. Old One Rupee Coin: ఇలాంటి పాత రూపాయి నాణేలు ఉంటే.. ఇప్పటికిప్పుడే రూ.75 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే?EPFO: 7.5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. మీ డబ్బులు తీసుకునేందుకు రిటైర్మెంట్ వరకు ఆగాల్సిన అవసరం లేదు..!!
Phonepe UPI Being Free Upi Business News Telugu News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Godavari Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోదావరి హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే..!Godavari Heroine: తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోయే అరుదైన సినిమాలలో గోదావరి చిత్రం ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా క్లాసిక్ సినిమాగా ఎంతోమంది దగ్గర ఆదరింపపడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో రాజీ పాత్రలో కనిపించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది అనే ఒక విషయం..
Read more »
Nagarjuna: రూట్ మార్చిన నాగార్జున.. విమర్శకులను సైతం మెప్పించేలా..!Nagarjuna Kubera: తెలుగు సీనియర్ హీరోలు.. ఎంచుకుంటున్న సినిమాలు ప్రస్తుతం ఎంతోమంది దగ్గర నుంచి విమర్శలు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో నాగార్జున నటించిన గత చిత్రాలు కూడా ఈ దావలోకే వచ్చాయి. అయితే ప్రస్తుతం నాగార్జున ఈ మూస ధోరణికి దూరమవుతూ కనిపిస్తున్నారు..
Read more »
PhonePe IPO: ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్..స్టాక్ మార్కెట్ పై గురిపెట్టిన ఫోన్ పే..ఏకంగా రూ. 12,750కోట్లు..!!PhonePe IPO: భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి షురూ కానుంది. ఇన్వెస్టర్లు కూడా ఎక్కువగా ఐపీఓల గురించి ఎదురుచూస్తున్నారు. లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయని వారు భావిస్తుంటారు. అయితే అలాంటి వారందరికీ ఇప్పుడూ బిగ్ అలర్ట్.
Read more »
YS Vijayamma: ఫోన్ ట్యాపింగ్లో మరో సంచలనం.. వైఎస్ విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్YS Vijayamma Phone Also Tapped Here Full Details: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వైఎస్ విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్కు పాల్పడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
Old One Rupee Coin: ఈ పాత రూపాయి నాణెం ఉంటే..రూ.5 లక్షలు మీ సొంతం.. ఇప్పుడే ఇలా చేయండి..Old One Rupee Coin Sale: ప్రస్తుతం చాలామంది పాత రూపాయి నాణేలను విక్రయించి లక్షల సంపాదిస్తున్నారు. అయితే మీ దగ్గర కూడా పాత రూపాయి బిళ్ళ ఉంటే లక్షలు సంపాదించుకోవచ్చు. అదెలాగో మీకు ఈరోజు మేము తెలియజేయబోతున్నాం..
Read more »
Old Rs.2 Note: పాత రూ.2 నోట్లు ఉంటే చాలు.. ఇలా చేస్తే రూ.15 లక్షలు మీ సొంతం.. నమ్మట్లేదా?Old Rs.2 Note Sale: ప్రస్తుతం చాలామంది OLXతో పాటు ఇతర పాత వస్తువులను విక్రయించే వెబ్సైట్లో పాత రూపాయి నోట్లతో పాటు రెండు రూపాయల నోట్లోను విక్రయిస్తున్నారు. ఈ నోట్లు ఏకంగా ఐదు లక్షల అమ్ముడుపోతున్నాయి. మీ దగ్గర కూడా ఉంటే ఇలా వికాయిస్తే దాదాపు మూడు నోట్లకు 15 నుంచి 18 లక్షలు పొందవచ్చు.
Read more »
